ఈవెంట్స్ కు అంతా రెడీ జనవరి 3 వరకు ఫిజికల్ టెస్టులు
ఖమ్మం, తెలుగు న్యూస్ ఇండియా: పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా ఫిజికల్ ఎఫిసెన్సీ టెస్ట్. ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు గురువారం ప్రారంభమవుతున్నాయి. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జనవరి ౩ వరకు జరిగే ఈవెంట్స్కు ఉమ్మడి జిల్లా నుంచి 24,733 మంది హాజరుకానున్నారు. వీరిలో 20,033 మంది పురుషులు. 4,700 మంది మహిళలున్నారు. మొదటి రోజు 600 మంది అటెండ్ కానున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. ఎలాంటి తప్పులకు, అవకతవకలు జరగడానికి ఆస్కారం లేకుండా లేటెస్ట్ కొత్త టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది. బయో మెట్రిక్, ప్రతి అభ్యర్థిచేతికి చిప్తో కూడిన రిస్ట్ బ్యాండ్, డిజిటల్ చిప్తో ఉన్నఆర్ఎఫ్ఐడీ జాకెట్స్ను అటాచ్ చేయనున్నారు. వీటి ద్వారా ఈవెంట్స్ పారదర్శకంగా జరిగేలా ప్లాన్ చేశారు.
ప్రక్రియ సాగేదిలా
ముందస్తుగా పోలీస్ వారి యొక్క హెడ్ క్వార్టర్స్ సమీపంలో ఉన్నటువండి శివాలయం దగ్గర పోలీస్ సిబ్బంది అడ్మిట్ కార్డు ఉన్న అభ్యర్థులకు మాత్రమే టోకెన్ నెంబర్ ఇచ్చి పోలీస్ వారి యొక్క కళ్యాణ మండపంలోనికి అనుమతించడం జరుగుతుంది. అక్కడ డాక్యుమెంట్ పరిశీలన ఉంటుంది. బయోమెట్రిక్ తర్వాత రిస్ట్ బ్యాండ్, ఆర్ఎఫ్ఐడీ జాకెట్స్ అటాచ్ చేసుకున్న పురుష అభ్యర్థులకు 1,600 మీటర్లు. మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు నిర్వహిస్తారు. నిర్దీత సమయంలో రన్నింగ్ కంప్లీట్ చేసిన వారి ఎత్తు కొలుస్తారు. నిర్దేశించబడిన ఎత్తు ఉన్న వారిని షాట్ పుట్, లాంగ్ జంప్ పోటీలకు అనుమతించడం జరుగుతుంది. ఈవెంట్ల దగ్గర సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వాటిని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లతో అనుసంధానించారు. జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ల పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఏ.సీ.పీ స్థాయి అధికారిని నియమించినట్టు సీ.పీ విష్ణు వారియర్ గారు తెలియజేసారు. అభ్యర్థులు రిక్రూట్మెంట్ బోర్డు తేదీలలో హజరుకావాలని, తమతోపాటు అడ్మిట్ కార్డ్, ఇంటిమేషన్ లెటర్, డాక్యుమెంట్స్, పార్ట్-2 అప్లికేషన్ నుంచి సంబంధిత సర్టిఫికెట్ల అటెస్టేడ్ ఫొటో కాపీలను తీసుకురావాలన్నారు.
దళారుల ప్రమేయం లేకుండా
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పోలీస్ పరేడ్ గ్రౌంద్స్ పరిసరాల్లో పూర్తి స్థాయిలో నిఘా వ్యవస్థనుపటిష్టం చేశారు. 355 మందితో బందోబస ఏర్పాటు చేశారు. ఈ టీమ్లో ఇద్దరు అడిషనల్ 'సీపీలు. 11మంది ఏసీపీలు. 17 మంది సీఐలు. 31 మంది ఎస్ఐలు, 8 మంది మహిళా ఎస్ఐలు. 55 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, 230 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డ్ ఆఫీసర్లు బందోబస్తు డ్యూటీలో పాల్గొంటారు. అభ్యర్థులంతా ఉదయం 5 గంటలకు ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకుని క్యూలైన్లో నిలబడి టోకెన్ పొందాలి. పరేడ్గ్రౌండ్లో మెడికల్ టీమ్, షామియానాలు, మంచినీరు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటుచేశారు.
- అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులో ఇచ్చిన సమయం. తేదీలో రిపోర్ట్ చేయాలి. సమయపాలన పాటించాలి.
- అడ్మిట్ కార్డు, ఇంటిమేషన్ లెటర్, అభ్యర్థి సంతకం చేసిన పార్ట్-2 అప్లికేషన్ ప్రింట్-అవుట్ తీసుకురావాలి.
- ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్, సెల్ఫ్ అటెస్టేడ్ ఫోటో కాపీ తెచ్చుకోవాలి.
- ఉదయం 5 గంటలకే అభ్యర్థులు పరేడ్ గ్రౌండ్ కు చేరుకోవాల్సి ఉంటుంది.
- దళారులు మాటలు నమ్మి మోసపోవద్దు.ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పిర్యాదు చేయాలి.
- అవసరమైన వ్యక్తిగత వస్తువులను తీసుకురావద్దు.
- మహిళలు ఆభరణాలు, హ్యాండ్ బ్యాగులు, పౌచ్ లను వెంట తెచ్చుకోవద్దు.మొబైల్ ఫోన్ లను అనుమతించరు.
- బయోమెట్రిక్ డేటా ఆధారంగా అభ్యర్థుల గుర్తింపు ధ్రువీకరణ ఉంటుంది. మెహందీ, పచ్చబొట్టు, బయోమెట్రిక్ ద్రువీకరణకు ఆటంకం కలిగించేలా ఉండొద్దు.